తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో చోరీ

18 Dec, 2015 19:32 IST|Sakshi

అనంతపురం అర్బన్ : తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి వరుసగా నాలుగు ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. అనంతపురం పట్టణంలోని రెవెన్యూ కాలనీలో ఉన్న నాలుగు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడినట్లు గుర్తించిన స్థానికులు శుక్రవారం పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక ఇంట్లో రూ. 50 వేల నగదుతో పాటు విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. చోరీలకు గురైన ఇళ్ల యజమానులు వస్తేగానీ పూర్తి వివరాలు తెలియవని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు