విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో దోపిడీ

11 Nov, 2014 11:37 IST|Sakshi
విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో దోపిడీ

విజయవాడ : విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో దుండగులు దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏ1 బోగీలో క్లోరోఫామ్ చల్లి మహిళల వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. అనంతరం విజయవాడ సమీపంలో చైన్ లాగి దుండగులు పరారయ్యారు. బాధితులు కాజీపేట రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు