రోషిణి కేరాఫ్‌ తూర్పుగది సినిమాకు ప్రేక్షకాదరణ

28 Jul, 2018 13:08 IST|Sakshi

చిత్ర నిర్మాత, దర్శకుడు కేజేపురం యువకులు

విశాఖపట్నం ,మాడుగుల రూరల్‌ :మండలంలో కె.జె.పురం గ్రామానికి చెందిన శరగడం సోదరులు నిర్మించిన∙చలన చిత్రం రోషిణి కేరాఫ్‌  తూర్పుగది చలన చిత్రం శుక్రవారం విడుదలైంది కె.జె.పురం గ్రామానికి చెందిన శరగడం నాగునాయుడు కుమారులు గత పది సంవత్సరాలుగా హైదరాబాదులో చలనచిత్ర రంగంలో పనిచేస్తు, గతంలో ధడేల్, ఇద్దరం  చలనచిత్రాలు నిర్మించారు.

ఇప్పుడు తాజాగా తాము నిర్మించిన రోషిణి కేరాఫ్‌  తూర్పు గది చలనచిత్రం ప్రేక్షకాదరణకు నోచుకుంటోందని నిర్మాతలు తెలిపారు.  శరగడం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శరగడం సుధీర్‌ నిర్మాతగా వ్యహరిస్తున్నారు. ఇది ప్రేమ కథాంశంతో పాటు హర్రర్‌ చలన చిత్రమని దర్శకుడు తెలిపారు.

మరిన్ని వార్తలు