రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగ

25 Oct, 2015 10:52 IST|Sakshi

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా : జిల్లాలో శనివారం ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ రెండో రోజు కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో  బారా షహీద్ దర్గాకు చేరుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధం(సందల్) ఊరేగింపు ఉండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా నగర పాలక సంస్థతోపాటు వక్ఫ్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంది.

మరిన్ని వార్తలు