విజయనగరం: ‘అయ్యా ! మేం తోటపల్లి నిర్వాసితులం. పార్వతీపురం పక్కనే బంటువానివలసలో నివసిస్తున్నాం. కన్నతల్లి లాంటి ఊరును, భూములను వదిలేసి వస్తే మాకు అన్యాయం జరిగింది. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా గ్రామంలోనే 43 మంది యువకులకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లస్థలాలు ఇవ్వలేదన్నా. జీవనోపాధి లేక అల్లాడుతున్నాం. భూములు, ఇళ్లకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఇళ్ల నిర్మాణానికే సరిపోయింది. పూర్తి స్థాయి ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేసి మమ్మల్ని ఆదుకోవాలన్నా. అంటూ బంటువానివలసకు చెందిన మంగావారి మంగమ్మ, అంబటి నారాయణమ్మ జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. తాను అధికారంలోకి వస్తే ఈ సమస్య పరిష్కరిస్తామని జననేత హామీఇచ్చారు.