'ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల నిధులు'

1 Nov, 2014 13:56 IST|Sakshi

ఏలూరు: తీరప్రాంత మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శనివారం పశ్చిమగోదావరిజిల్లాలోని మోరీ, కలవపూడి గ్రామాలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి, నీరు - చెట్టు, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.

అనంతరం బాబు మాట్లాడుతూ.... ప్రతి గ్రామానికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల అభివృద్ధికి రూ. 1300 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.

మరిన్ని వార్తలు