రూ.15 లక్షల నగదు, రంగురాళ్లు స్వాధీనం

8 Mar, 2014 09:53 IST|Sakshi

కొత్తగూడెం : స్థానిక ఎన్నికలతో పాటు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లావ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా కొత్తగూడెంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వారి సోదాల్లో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.12 లక్షల నగదు బయటపడింది. ఆ నగదుకు సరైన ఆధారాలు లేకపోవటంతో పోలీసులు స్వాధీనం చేసుకుని, ఓ వ్యక్తిని విచారిస్తున్నారు.

మరోవైపు కొత్తగూడెం మండలం రామవరంలో 200 బస్తాల రంగురాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు లక్షల నగదును పట్టుకున్నారు. కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.

మరిన్ని వార్తలు