రైతుల పేరుతో రూ. 20 లక్షలు స్వాహా

12 May, 2015 11:52 IST|Sakshi

నెల్లూరు: నెల్లూరు జిల్లా కొండాపూర్ మండలం రాయపేటలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లోని ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించాడు. రైతుల పేరుతో రూ. 20 లక్షలు స్వాహా చేశారు. ఆ విషయాన్ని అధికారులు చాలా ఆలస్యంగా గుర్తించారు. దాంతో బ్యాంకు అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం విచారణ చేపట్టారు. అందులోభాగంగా బ్యాంకు ఉద్యోగిని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు