-

భక్తులకు అందుబాటులో రూ.300 ఆన్‌లైన్ టికెట్లు

25 Feb, 2015 22:49 IST|Sakshi

సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ ప్రారంభించిన రూ.300 ఆన్‌లైన్ టికెట్లలో ఈనెల 27వ తేదీ నుంచి మార్చి 5వ తేది వరకు ఖాళీ వివరాలను బుధవారం రాత్రి ప్రజాసంబంధాల విభాగం విడుదల చేసింది. ఈనెల 27వ తేదీన 10,025 టికెట్లు, 28న 5,647 టికెట్లు, మార్చి 1 ఆదివారం 7,499, 2వ తేదీన 11,253, 3వ తేదీన 13,673, 4వ తేదీన 13,769, 5వ తేదీన 12,911 టికెట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు