టీడీపీ నేతకు చెందిన రూ.68 లక్షలు స్వాధీనం!

16 Mar, 2014 08:39 IST|Sakshi

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన సందర్భంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలో విజయవాడ సమీపంలోని ఇబ్రహీం పట్నం వద్ద ఆదివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా కారులో తరలిస్తున్న రూ. 68 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కారు డ్రైవర్తోపాటు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఆ నగదుపై డ్రైవర్తోపాటు వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ నగదును టీడీపీకి చెందిన నేతదని వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

అలాగే నెల్లూరు జిల్లా కోవూరులో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.11 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఆ నగదును తరలిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు. ఆ నగదుకు సంబంధించిన వివరాలపై పోలీసులు యువకుడిని ప్రశ్నిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు