డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్, ఒకరి మృతి

19 Nov, 2014 07:57 IST|Sakshi

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి వున్న డీసీఎం వ్యాన్ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా, బస్సులో ప్రయాణిస్తున్న 10మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు