బస్సు ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి

8 Nov, 2015 15:04 IST|Sakshi

అనంతపురం ఆర్టీసీ డిపోలో బస్సు ఢీకొని నాగరాజు(53) అనే ఆర్టీస్ డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాగరాజును బెంగుళూరు తరలించడానికి ప్రయత్నించగా... మార్గమధ్యంలోనే మరణించాడు. దీంతో ఆదివారం మధ్యాహ్నం నాగరాజు కుటుంబీకులు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగారు.


 

>
మరిన్ని వార్తలు