తూర్పుగోదావరి : ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన వారికి సంస్థ తరపున సేవలు సక్రమంగా అందడం లేదని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి పడాల వెంకటేశ్వరరావు కరకుదురులో జగన్ దృష్టికి తీసుకొచ్చారు. తాను 2009లో రిటైర్ అయ్యానని, కాకినాడలో విశ్రాంత ఉద్యోగులకు వైద్య సదుపాయం, మందులు సక్రమంగా అందడం లేదన్నారు. సంస్థకు చెందిన అన్ని బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించేలా కృషి చేయాలని జగన్కు చెప్పినట్టు వెంకటేశ్వరరావు అన్నారు.