వేధింపులపై ఆర్టీసీ కార్మికుల ధర్నా

28 Dec, 2015 12:45 IST|Sakshi

డిపో సమస్యలను పరిష్కరించాలని, అధికారులు వేధింపులు ఆపాలని జమ్మలమడుగులో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో డిపో గ్యారేజి ఎదుట బైఠాయించారు. ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ శివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి గంగిరెడ్డి సహా 40 మంది కార్మికులు పాల్గొన్నారు.



 

మరిన్ని వార్తలు