హైదరాబాద్: సంఘ సంస్కర్త, నగర మాజీ మేయర్ కె.కృష్ణస్వామి ముదిరాజ్ పేరిట నెలకొల్పిన హైద్రాబాద్ జిల్లా ఉత్తమ జర్నలిస్టు-2014 అవార్డును ‘సాక్షి’ దినపత్రిక సీనియర్ జర్నలిస్టు ఎస్.కామేశ్వర్రావు(కామేశ్) దక్కించుకున్నారు. సికింద్రాబాద్ బోయిగూడ ముదిరాజ్ సంఘంలో ఆదివారం జరిగిన మాజీ కృష్ణస్వామి ముదిరాజ్ 121వ జయంతి వేడుకల్లో కామేశ్కు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే కాసాని జ్ఞానేశ్వర్ కలసి ఈ అవార్డును అందజేశారు.
హైదరాబాద్కు సంబంధించి వివిధ అంశాలపై కామేశ్ రాసిన వార్తలకు ఈ అవార్డును అందజేసినట్లు కె. కృష్ణస్వామి మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు నర్సింహులు తెలిపారు. అవార్డు కింద రూ.50 వేల నగదు, జ్ఞాపికను అందజేశారు. ఈ సంద ర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు. తమ వార్తల ద్వారా ప్రజా సమస్యలకు జర్నలిస్టులు పరిష్కారం చూపుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్, ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు జి.మల్లయ్య, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.