సాక్షి, హైదరాబాద్ : పశ్చిమబెంగాల్లోని సీపీఎం, కాంగ్రెస్, టీఎంసీకి చెందిన 107మంది ఎమ్మెల్యేలు కమలం కండువా కప్పుకోనున్నారని, ప్రస్తుతం వీరి జాబితా సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ఈ చేరికలు ఉంటాయని బీజేపీ బెంగాల్ సీనియర్ నేత ముకుల్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పర్సనల్ అసిస్టెంట్ శేఖర్కు జైలు శిక్ష ఖరారైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శేఖర్కు మూడేళ్ల జైలు, మూడు లక్షల జరిమానా విధిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమంతా సంజీవనిగా భావిస్తున్న ‘ప్రత్యేక హోదా’ కోసం అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. హోదా సాధించేంతవరకూ వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..