సేల్స్ టాక్స్ అధికారుల తనిఖీలు

12 Oct, 2015 15:32 IST|Sakshi

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సేల్స్ టాక్స్ అధికారులు సోమవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న వస్తువులను అధికారులు సీజ్ చేశారు. రామచంద్రాపురం డీటీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు రెండు ఆటోలు, ఒక రిక్షాను పట్టుకున్నారు. వాటిల్లో ఎలాంటి బిల్లులు.. సంబంధిత పత్రాలు లేకుండా సామగ్రి తరలి పోవడాన్ని గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. రూ. లక్ష విలువైన వస్తు సామాగ్రిని సీజ్ చేసి.. వాహనదారులపై కేసులు నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు