జగన్‌కు మెడనొప్పి: శంఖారావం ఒక రోజు వాయిదా

16 Jan, 2014 17:21 IST|Sakshi
జగన్ సమైక్య శంఖారావం యాత్ర

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  సమైక్య శంఖారావం యాత్ర ఒకరోజు వాయిదా పడింది. ఈ నెల 17వ తేదీకి  బదులు 18వ తేదీకి వాయిదాపడింది.

 జగన్‌కు మెడనొప్పి కారణంగా సమైక్య శంఖారావం యాత్ర  ఒక రోజు వాయిదా వేసినట్లు ఆ పార్టీ చిత్తూరు జిల్లా  కన్వీనర్‌ నారాయణ స్వామి చెప్పారు. 18 నుంచి  జగన్‌ సమైక్య శంఖారావం యాత్ర తిరిగి ప్రారంభిస్తారని వైఎస్‌ఆర్‌ సీపీ ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు.

మరిన్ని వార్తలు