న్యాయమే గెలిచింది: సామినేని

28 Oct, 2017 16:23 IST|Sakshi

సాక్షి, కృష్ణా: జగ్గయ్యపేట మున్సిపల్‌ ఎన్నికల్లో న్యాయమే గెలిచిందని వైఎస్‌ఆర్‌సీపీ నేత సామినేని ఉదయబాను అన్నారు. ఎన్నికలను వాయిదా వేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ చాలా కుట్రలు చేసిందని తెలిపారు. తమ పార్టీ సభ్యులను కిడ్నాప్‌ చేశారంటూ టీడీపీ కొత్త డ్రామాలకు తెరలేపిందన్నారు. 

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్‌ ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్‌లో మున్సిపల్‌ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. 

మరిన్ని వార్తలు