మాడుగుల: అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక లారీలను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం వి.వి.అగ్రహారంలో మంగళవారం రాత్రి జరిగింది. వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు లారీలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.