2 ఇసుక లారీలు స్వాధీనం

5 Aug, 2015 12:35 IST|Sakshi

మాడుగుల: అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక లారీలను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం వి.వి.అగ్రహారంలో మంగళవారం రాత్రి జరిగింది. వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు లారీలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు