ఇసుక ట్రాక్టర్లు సీజ్.. ముగ్గురిపై కేసు నమోదు

13 Mar, 2015 19:58 IST|Sakshi

అనంతపురం: అనంతపురం జిల్లాలో మూడు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు బ్రహ్మసముద్రం ఎస్ఐ శివ తెలిపారు. ఈ నేపథ్యంలో తమ వాహనాలు సీజ్ చేస్తావా అంటూ టీడీపీ నేతలు దుర్భాషలాడినట్టు ఎస్ఐ తెలిపారు. ఇసుక ట్రాక్టర్లను టీడీపీ నేతలు దౌర్జన్యంగా తీసుకెళ్లినట్టు ఆయన చెప్పారు.  టీడీపీ సర్పంచ్ తిమ్మప్ప చౌదరి సహా ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శివ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు