రైల్వే కోడూరులో భారీగా ఎర్రచందనం స్వాధీనం

8 Oct, 2013 08:27 IST|Sakshi

వైఎస్ఆర్ కడప జిల్లాలోని రైల్వే కోడూరులో పెట్రోల్ బంక్ సమీపంలో అరిటికాయల మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

అనంతరం వారిని రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుత్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే మినీ లారీని కూడా స్టేషన్కు తరలించి సీజ్ చేసినట్లు వివరించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు