ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

12 Jan, 2020 09:53 IST|Sakshi

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): సంక్రాంతి సెలవుల ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం జి.సునీల్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విజయవాడ–విజయనగరం–విజయవాడ(వయా దువ్వాడ)
విజయవాడ–విజయనగరం(07184) జనసాధారణ్‌ స్పెషల్‌ విజయవాడలో ఈనెల 11,12,13 రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 5.20 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 5.22 గంటలకు బయల్దేరి అదే రోజు ఉదయం 7.20 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07185) విజయనగరంలో ఈనెల 12, 13, 14 తేదీల్లో ఉదయం 7.45 గంటలకు బయల్దేరి ఉదయం 9.23 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.25 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు 12 జనరల్‌ క్లాస్‌ కోచ్‌లతో నడుస్తుంది. రానుపోను నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్‌లలో ఆగుతుంది.

విజయనగరం–విజయవాడ-విజయనగరం జనసాధారణ్‌ స్పెషల్‌
విజయనగరం–విజయవాడ(07187) రైలు విజయనగరంలో ఈనెల 17,18,19 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు బయల్దేరి రాత్రి 10.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 10.32 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(07186) విజయవాడలో ఈనెల 18,19 తేదీల్లో మధ్యాహ్నం 12.15 గంటలకు బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.32 గంటలకు బయల్దేరి రాత్రి 8.15 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. ఈ రైలు 12 జనరల్‌ క్లాస్‌ కోచ్‌లతో నడుస్తుంది. రానుపోను నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్‌లలో ఆగుతుంది.

విజయనగరం–రాజమండ్రి–విజయనగరం జనసాధారణ్‌ స్పెషల్‌
విజయనగరం–రాజమండ్రి(07197) స్పెషల్‌ ఈనెల 14వ తేదీన ఉదయం 7.45 గంటలకు విజయనగరంలో బయల్దేరి ఉదయం 9.23గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.25 గంటలకు బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07198) రైలు రాజమండ్రిలో ఈనెల 17వ తేదీన  మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.32 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.15 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. ఈ రైలు 12 జనరల్‌ క్లాస్‌ కోచ్‌లతో నడుస్తుంది. ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్‌లలో ఆగుతుంది.

విశాఖపట్నం–సికింద్రాబాద్‌– విశాఖపట్నం స్పెషల్‌
విశాఖపట్నం–సికింద్రాబాద్‌(08523) స్పెషల్‌ రైలు విశాఖపట్నంలో ఈనెల 12,19 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 13, 20 తేదీల్లో సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 4.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు 1–సెకండ్‌ ఏసీ, 2– థర్డ్‌ ఏసీ, 6–స్లీపర్‌ క్లాస్, 4–జనరల్‌ సెకండ్‌ క్లాస్, 2–సెకండ్‌ క్లాస్‌ కమ్‌ లగేజి కోచ్‌లతో నడుస్తుంది. దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం స్టేషన్‌లలో ఆగుతుంది.

విశాఖపట్నం–విజయవాడ–విశాఖపట్నం డబుల్‌ డెక్కర్‌ స్పెషల్‌
విశాఖపట్నం–విజయవాడ(08525) డబుల్‌ డెక్కర్‌ స్పెషల్‌ విశాఖలో ఈనెల 12,19 తేదీల్లో ఉదయం 5.45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 11.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08526) విజయవాడలో అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈరైలు 8 డబుల్‌ డెక్కర్‌ కోచ్‌లతో నడుస్తుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్‌లలో ఆగుతుంది.  

మరిన్ని వార్తలు