ఫోన్‌ బుక్‌ చేస్తే సబ్బులు వచ్చాయి

7 Jun, 2019 13:19 IST|Sakshi
సబ్బులను చూపిస్తున్న త్రినాథ్‌రధో

మెళియాపుట్టి: మెళియాపుట్టి గ్రామానికి చెందిన త్రినాథ్‌రధో మొబైల్‌ కోసం ఆర్డర్‌ ఇస్తే పార్శిల్‌లో సబ్బులు రావడంతో నివ్వెరపోయారు. రూ.15,990 విలువ గల మొబైల్‌ కోసం ప్లిప్‌కార్ట్‌లో (ఆన్‌లైన్‌లో) బుక్‌ చేశారు. గురువారం వచ్చిన పార్శిల్‌ను తెరచి చూసేసరికి మొబైల్‌కు బదులు ఐదు సంతూరు సబ్బుల ప్యాకెట్‌ రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా ఆన్‌లైన్‌లో మోసపోవడం పట్ల త్రినాథ్‌రధో ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు