22న ఐఐటీ, జేఈఈ, నీట్‌లపై ‘శశి’అవగాహన సదస్సు

20 Apr, 2018 01:46 IST|Sakshi

ఉండ్రాజవరం: ఐఐటీ, జేఈఈ, నీట్‌ కోచింగ్‌పై ఈనెల 22వ తేదీన విశాఖపట్నం, వేలివెన్ను క్యాంపస్‌లలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు శశి విద్యాసంస్థ ల చైర్మన్‌ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈ సదస్సులో ఐఐటీ, నీట్‌ శిక్షణలలో అనుభవజ్ఞులైన సీనియర్‌ అధ్యాపక బృందం.. సీట్లు, సిలబస్‌ వివరాలు, పరీక్షా విధానం గురించి వివరిస్తారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు వేలివెన్ను క్యాంపస్‌ 08819– 242222,  విశాఖ క్యాంపస్‌ 9705925599 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఈ సదస్సులో తల్లిదండ్రులకు, విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేస్తున్నట్టు సంస్థ వైస్‌ చైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్, మేకా నరేంద్రకృష్ణ తెలిపారు.

మరిన్ని వార్తలు