ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య: కిశోర్ బాబు

6 Oct, 2014 14:32 IST|Sakshi
ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య: కిశోర్ బాబు

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను త్వరలోనే ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఇందుకు ఆర్హులైన విద్యార్థులను గుర్తిస్తామని ఆయన అన్నారు.

దీనికి సంబంధించిన ఖర్చులన్నింటినీ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల నుంచే ఖర్చు చేయనున్నట్లు మంత్రి కిశోర్ బాబు చెప్పారు. ఈ ఏడాది సుమారు వెయ్యిమంది విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపాలని యోచిస్తున్నట్లు మంత్రి వివరించారు.

మరిన్ని వార్తలు