-
విజయవాడ: విజయవాడ నగరంలో బుధవారం మధ్యాహ్నం ఓ ప్రైవేటు స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రామవరప్పాడు రింగురోడ్డు వద్ద ముందు వెళ్తున్న వంటగ్యాస్ సిలిండర్ల లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, స్కూలు బస్సు బలంగా ఢీకొట్టి ఉంటే గ్యాస్ సిలిండర్లు పేలి ప్రమాదం ఊహించలేనంత తీవ్రంగా ఉండేదని స్థానికులు తెలిపారు.