నాణెం మింగిన విద్యార్థిని

10 Sep, 2019 08:10 IST|Sakshi

అనంతపురం ,గార్లదిన్నె: నోటిలో పెట్టుకున్న రెండు ఐదు రూపాయల నాణేన్ని ఓ విద్యార్థిని పొరపాటున మింగేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 108 సిబ్బంది జయరాజు, శీనానాయక్‌ తెలిపిన మేరకు... కనంపల్లికి చెందిన తులసి అనే ఐదో తరగతి విద్యార్థిని ఆదివారం ఐదు రూపాయల నాణేన్ని నోటిలో పెట్టుకుని అనుకోకుండా మింగేసింది. సోమవారం కడుపు నొప్పి రావడంతో అప్పుడు తాను మింగిన నాణెం గురించి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు హుటాహుటిన 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అనంతరం తల్లిదండ్రులు పాపకు అరటిపండు తినిపించడంతో మలవిసర్జనలో నాణెం బయటకు వచ్చేసింది.

మరిన్ని వార్తలు