ఏపీ భవన్లో సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన

14 Aug, 2013 14:06 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం యూపీఏ సర్కార్ను డిమాండ్ చేశారు. అందులోభాగంగా ఏపీ భవన్లో సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు ఆ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ భవన్లో ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ పాల్గొన్నారు. వారికి తన సంఘీభావాన్ని ప్రకటించారు.

మరిన్ని వార్తలు