అనంతపురం: జిల్లాలో సమైక్యఉద్యమాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలోని ఏపిఎన్జిఓ, రెవిన్యూ ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు.
పంచాయతీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. న్యాయవాదులు విధులు బహిష్కరించారు.