ఎస్వీ పరిధిలో డిగ్రీకీ సెమిస్టర్ విధానం

28 Apr, 2015 08:27 IST|Sakshi

తిరుపతి(చిత్తూరు): శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇకపై డిగ్రీలోనూ సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ విధానం 2015-2016 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. ఎస్వీయూలో ప్రస్తుతం పీజీ కోర్సుల్లో మాత్రమే సెమిస్టర్ విధానం ఉంది. దీంట్లో భాగంగా ఏటా రెండు సెమిస్టర్లు నిర్వహించనున్నారు. ఈమేరకు సోమవారం ఎస్వీయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు