తిరుమలలో సర్వర్‌ డౌన్‌.. భక్తుల ఇక్కట్లు

3 Mar, 2018 12:29 IST|Sakshi
(ఫైల్ ఫోటో)

సాక్షి, తిరుమల: శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధి తిరుమలలో శనివారం కంప్యూటర్లు మొరాయించాయి. దీంతో గదులు కేటాయించే సీఆర్‌ఓ కార్యాలయంలో గంటకుపైగా కంప్యూటర్లు పని చేయలేదు. సర్వర్‌ డౌన్‌ కావడంతో భ​క్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గదులు కోసం గంటల తరబడి క్యూలైన్‌లో పడిగాపులు గాస్తున్నారు. కంప్యూటర్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు