ఆటో - కారు ఢీ: ఏడుగురికి గాయాలు

23 Jul, 2014 12:29 IST|Sakshi

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కంచిలి వద్ద ఆటో - కారు ఢీ కొన్నాయి. ఆ ప్రమాదంలో ఆటోలోని ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం పోలీసులు శ్రీకాకుళం తరలించారు.  
 

మరిన్ని వార్తలు