అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్లను ప్రభుత్వం గురువారం రాత్రి బదిలీ చేసింది. ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. బదిలీ అయిన వారిలో పోలీసు ట్రయినింగ్ అధిపతిగా సంజయ్, గుంటూరు డీఐజీగా గోపాలరావు, రాయలసీమ ఐజీగా మహమ్మద్ ఇక్బాల్, విశాఖ జాయింట్ సీపీగా నాగేంద్రకుమార్, మెరైన్ డీఐజీగా ఎ.ఎస్.పాల్, విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా షకీలప్ప, మెరైన్ ఎస్పీగా నవీన్ గులాటి, విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా జయలక్ష్మి, విజయవాడ అడ్మిన్ డీసీపీగా బ్రహ్మారెడ్డి, పీటీవో ఎస్పీగా నారాయణ నాయక్, గ్రేహైండ్స్ ఎస్పీగా నవదీప్ గ్రేవల్, ఇంటిలిజెన్స్ ఎస్పీలుగా విజయకుమార్, భాస్కర్ భూషణ్, సెంథిల్ కుమార్, ఏపీఎస్పీ 5వ బెటాలియన్ (విజయనగరం) అధిపతిగా కోటేశ్వరరావును బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.