సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం–సికింద్రాబాద్తో పాటు పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–సికింద్రాబాద్ (08501/08502) ప్రత్యేక రైలు డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 11.00కు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 4.30కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50కి విశాఖ చేరుకుంటుంది. హైదరాబాద్–కాకినాడ (07075/07076) ప్రత్యేక రైలు ఈ నెల 23న సాయంత్రం 6.50కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50కి నాంపల్లి చేరుకుంటుంది.