మూడు రాజధానులకు మద్దతుగా పలు సంఘాల ర్యాలీ

11 Jan, 2020 13:27 IST|Sakshi

సాక్షి, కర్నూలు: అమరావతి వద్దు.. అభివృద్ధి వికేంద్రికరణ ముద్దు అంటూ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నినాదాలు చేశాయి. రాజధాని వికేంద్రీకరణకు సంఘీభావం తెలుతున్నాయి. ఈ సందర్భంగా సంఘ నేతలు మాట్లాడుతూ..  రాజధాని రైతుల పేరుతో అమరావతిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టే బస్సు యాత్రను అడ్డుకుంటామని తెలిపారు. చంద్రబాబు, సీపీఐ అధ్యక్షుడు రామకృష్ణ , ఆ పార్టీ నేతలు రాయలసీమ ద్రోహులుగా  మిగిలిపోతారని విద్యార్థులు మండిపడ్డారు. 

చిత్తూరు జిల్లా: మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ నగరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. నియోజకవర్గంలోని క్లాక్‌ టవర్‌ నుంచి ఓంశక్తి ఆలయం వరకు చేపట్టిన ఈ భారీ ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా: విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ప్రతిపాదనకు మద్దతుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా వేదిక అధ్యక్షులు మాట్లాడుతూ.. రాజధాని 29 గ్రామాల సోత్తు కాదని, రాష్ట్ర ప్రజలందరిదన్నారు. అలాగే అధికార వికేంద్రికరణతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు