దుర్గమ్మకు 8 టన్నుల కూరగాయలు

29 Jul, 2015 08:06 IST|Sakshi

ఇంద్రకీలాద్రి: శాకంబరి ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని వ్యాపారులు 8 టన్నుల కూరగాయాలను విరాళంగా ఇచ్చారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో మరి కొద్ది సేపట్లో శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మూడు రోజుల పాటు భక్తులు అమ్మవారికి కూరగాయలను, ఆకుకూరలను కానుకలుగా సమర్పించనున్నారు.

ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. వేకువజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు