జీవిత ఖైదీ షేక్ జిలానీ మృతి

24 Dec, 2015 12:18 IST|Sakshi

విశాఖపట్నం: విశాఖపట్నం సెంట్రల్ జైలులో జీవిత ఖైదీ శిక్ష అనుభవిస్తున్న షేక్ జిలానీ (37) గురువారం మృతి చెందాడు. కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షేక్ జిలానీ మరణించాడు. జిలానీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు కేజీహెచ్కి తరలించారు. అతడు అక్కడ చికిత్స పొందుతూ... ఈ రోజు కన్నుమూశాడు. జిలానీ స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. అయితే అతడి మృతిపై కుటుంబసభ్యులకు జైలు అధికారులు సమాచారం ఇవ్వలేదని తెలిసింది.  
 

మరిన్ని వార్తలు