వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 209వ రోజు చీపురుపల్లి నియోజకవర్గంలోని అచ్యుతాపురం నుంచి ప్రారంభమయింది. పెనుబర్తి, గరివిడి, శ్రీరామ్నగర్, చీపురుపల్లి మీదుగా ఆమె పాదయాత్ర సాగుతుంది. ఈ సాయంత్రం చీపురుపల్లిలో జరగనున్న బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. సభ అనంతరం చీపురుపల్లిలోనే రాత్రి బస చేస్తారు.
మరోవైపు అలుపెరుగని పాదయాత్ర సాగిస్తున్న మహానేత తనయ మరో ఘనత సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 208 రోజులు పాదయాత్ర చేయగా, దాన్ని షర్మిల అధిగమించారు. 209 రోజుల పాటు పాదయాత్ర చేస్తూ సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. ప్రపంచంలో ఏ మహిళ చేయని విధంగా మొక్కవోని దీక్షతో పాదయాత్ర చేస్తున్న జగనన్న సోదరికి జనాలు నీరాజనాలు పడుతున్నారు.