టెన్త్ సోషల్ పరీక్షలు వాయిదా

30 Mar, 2014 01:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల నేపథ్యంలో ఈనెల 10, 11వతేదీల్లో నిర్వహించాల్సిన పదో తరగతి సోషల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 10వ తేదీన జరగాల్సిన సోషల్ పేపర్ 1ను, 11వతేదీన జరగాల్సిన సోషల్ పేపర్ 2 పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ మన్మథరెడ్డి తెలిపారు. తాజా షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 12న సోషల్ పేపర్ 1 పరీక్షను, 15వ తేదీన సోషల్ పేపర్ 2 పరీక్షను నిర్వహించనున్నారు. 12వతేదీన జరగాల్సిన ఓరియెంటల్ ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్(సంస్కృతం, అరబిక్, పర్షియన్) పేపర్-2 పరీక్షను 16 తేదీకి వాయిదా వేశారు. 15న జరగాల్సిన ఒకేషనల్ థియరీ పరీక్ష 17కు వాయిదా పడింది.
 
 రెండు పరీక్షల టైమింగ్స్ మార్పు: ఏప్రిల్ 7వతేదీన జరగనున్న సైన్స్ పేపర్  1తోపాటు 12వ తేదీ జరగనున్న సోషల్ పేపర్ 1 పరీక్షల సమయంలో మార్పు చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు కాకుండా 11 గంటల నుంచి 1.30 గంటల వరకు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెల 6వతేదీన, 11వతేదీన రెండు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ తర్వాత రోజుల్లో జరగనున్న ఈ రెండు పరీక్షలకు సెంటర్లలో తగిన  ఏర్పాట్లు చేయడానికి వీలుగా పరీక్షల నిర్వహణ సమయంలో మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు.
 
 షెడ్యూల్‌లో మార్పులు ఇవీ...
 
 పరీక్ష    పాత తేదీ    కొత్త తేదీ
 సోషల్ పేపర్-1    ఏప్రిల్ 10    ఏప్రిల్ 12
 సోషల్ పేపర్-2    ఏప్రిల్ 11    ఏప్రిల్ 15
 ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్    ఏప్రిల్ 12    ఏప్రిల్ 16
 వొకేషనల్ థియరీ    ఏప్రిల్ 15    ఏప్రిల్ 17


 

మరిన్ని వార్తలు