పాముకాటుకు గొర్రెలకాపరి మృతి

21 Sep, 2015 19:39 IST|Sakshi

శింగనమల : గొర్రెలను మేపడానికి వెళ్లిన వ్యక్తి పాముకాటుకు గురై మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని సోదనపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  గ్రామానికి చెందిన కేశమయ్య(50) గత రెండు సంవత్సరాల నుంచి గొర్రెలను మేపుకుంటూ జీవిస్తున్నారు. సోమవారం రుశ్యశృంగుని కొండపై గొర్రెలను మేపుతుండగా.. పాము కాటు వేసి అక్కడికక్కడే మృతిచెందాడు.

మరిన్ని వార్తలు