'కరువుకు చంద్రబాబు కూడా కారణమే'

21 Jan, 2017 14:49 IST|Sakshi
'కరువుకు చంద్రబాబు కూడా కారణమే'

అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి శైలజానాథ్‌ మండిపడ్డారు. వ్యవసాయం దండగా అనే సిద్దాంతాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. అనంతపురం కరువుకు చంద్రబాబు కూడా కారణమే అన్నారు.

సకాలంలో కరువు నివేదికను కేంద్రానికి పంపలేదని ధ్వజమెత్తారు. అనంతపురానికి 30 టీఎంసీల కృష్ణా జలాలు వచ్చినా సద్వినియోగం చేయలేదన్నారు.
 

మరిన్ని వార్తలు