నందిగామలో టీడీపీకి షాక్‌

22 Feb, 2019 19:16 IST|Sakshi

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీకి షాక్‌ తగిలింది. జీడీఎంఎం కాలేజీ అధినేత గురవిందపల్లి ప్రసాద్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి, గురవిందపల్లి ప్రసాద్‌కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ మొండితోక​ అరుణ్‌ కుమార్‌, నందిగామ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు