లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్ఐ

22 Oct, 2014 15:29 IST|Sakshi

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వంగర ఎస్ఐ వీరాంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో ఓ వ్యక్తి నుంచి వీరాంజనేయులు 5 వేల రూపాయలను లంచంగా తీసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు దాడి చేసి వీరాంజనేయులను అదుపులోకి తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు