సింగపూర్ వెళ్లనున్న చంద్రబాబు బృందం

4 Mar, 2015 23:15 IST|Sakshi

హైదరాబాద్:  రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం క్షేత్రస్థాయి పర్యటన చేస్తుందని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఈ నెల 30 లోపు ఆ బృందం మాస్టర్ప్లాన్ కాన్సెప్ట్ను సిద్ధం చేస్తుందని తెలిపారు.  బుధవారం సీఎం చంద్రబాబుతో సింగపూర్ బృందం భేటీ అయింది. అనంతరం నారాయణ మాట్లాడుతూ... రాజధాని మాస్టర్ ప్లాన్ను చంద్రబాబుకు సింగపూర్ బృందం వివరించిందని చెప్పారు.

ఈ నెల 30 చంద్రబాబు బృందం సింగపూర్ వెళ్లాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్లో ఇంకా 740 ఎకరాలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉందని నారాయణ స్పష్టం చేశారు. భూ వివాదాలు, యజమానుల నిర్థారణ వంటి సమస్యలున్నాయని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు