శ్రీనివాసరావు కాల్‌ డేటా ఆధారంగా సిట్‌ దర్యాప్తు

31 Oct, 2018 18:01 IST|Sakshi

సాక్షి, గుంటూరు : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు శ్రీనివాసరావు కాల్ డేటా ఆధారంగా సిట్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డానికి ముందురోజు నిందితుడు మాట్లాడిన కీలకమైన ఫోన్‌కాల్స్‌ డేటాను పోలీసులు సేకరించారు.

అందులో ఒక ఫోన్‌ నెంబరు పిడుగురాళ్ల పాత గణేశునిపాడుకు చెందిన నాగూర్‌వలి అనే వ్యక్తి పేరున ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నాగూర్‌వలిని కుటుంబంతో సహా అదుపులోకి తీసుకున్నారు. సిట్‌ పోలీసులు నాగూర్‌వలి ఇచ్చిన సమాచారంతో మరికొంతమందిని విచారించనున్నారు. 

మరిన్ని వార్తలు