వైఎస్‌ జగన్‌ నమ్మకాన్ని నిలబెడతా..

10 Sep, 2019 20:08 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీఘాకోళ్లపు

సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్‌సీపీ రాజమండ్రి నగర కో-ఆర్డినేటర్‌గా శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవీ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్సార్‌సీపీని విజయ పంథాన నడిపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, సుభాష్ చంద్రబోస్, కన్నబాబు, తానేటి వనిత, విశ్వరూప్, ఎంపీలు భరత్, గీత, అనురాధ, ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, రాజా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు