గుంటూరులో ఘోరప్రమాదం.. ఆరుగురు మృతి

1 Mar, 2020 17:20 IST|Sakshi

సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు మండలం 5వ మైలు వద్ద టవేరా కారు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఏటుకూరులో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా కాకుమానుకి చెందిన వారిగా గుర్తించారు. 

మరిన్ని వార్తలు