ఒకేరోజు ఆరుగురికి పాముకాటు

15 Jul, 2020 20:31 IST|Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా : పామర్రు నియోజకవర్గంలో రైతులు పాముకాటుకు గుర‌వుతున్నారు. మొవ్వ, పమిడిముక్కల మండలాల్లో ఒకే రోజున ఆరుగురు వ్య‌వ‌సాయ కూలీలు పాముకాటుకు గుర‌య్యారు. వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉందని వైద్యులు పేర్కొన్నారు. స‌కాలంలో హాస్పిట‌ల్‌కి తీసుకురావ‌డంతో ముప్పు త‌ప్పింద‌ని పేర్కొన్నారు.  వ్య‌వ‌సాయ‌ప‌నులు చేసే రైతులు, కూలీలు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.  వ‌ర్షాకాలం కావ‌డంతో ఇలాంటి కేసులు వ‌రుస‌గా జ‌రుగుతున్నాయ‌ని, ఇప్ప‌టికే 40 పాముకాటు కేసులు వెలుగుచూసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 


 

మరిన్ని వార్తలు