టీకా వికటించి చిన్నారి మృతి

16 Jun, 2016 19:34 IST|Sakshi

మారేడుమిల్లి(తూర్పుగోదావరి): వ్యాక్సిన్ వికటించి ఐదు నెలల చిన్నారి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం పెద్దమల్లంపాడు గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులకు బుధవారం వ్యాక్సిన్(పెంటావాలెంట్-రోటావైరస్) వేయించారు.

టీకా వేసిన కొద్ది సేపటికే ఐదునెలల చిన్నారి మృతిచెందింది. మరో ఇద్దరి చిన్నారుల పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు